ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి రైతుల దీక్షలు @ 292వ రోజు - అమరావతి నిరసనలు తాజా వార్తలు

అమరావతి రైతుల దీక్షలు 292వ రోజు కొనసాగాయి. తుళ్లూరు రైతుల దీక్షలకు... కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మద్దతు తెలిపారు.

amaravathi farmers protest
292వ రోజుకు అమరావతి దీక్షలు

By

Published : Oct 4, 2020, 6:48 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు 292వ రోజు దీక్ష కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, నెక్కల్లు, పెదపరిమి గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

తుళ్లూరులో రైతుల దీక్షకు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మద్దతు తెలిపారు. ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్.. చేసిన వాఖ్యలపై కృష్ణాయపాలెం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రికి వ్యవసాయం అంటే తెలుసా? వ్యవసాయ పనిముట్లు పేర్లు తెలుసా అంటూ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details