ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 27, 2019, 4:30 PM IST

ETV Bharat / state

రైతులకు మద్దతుగా తెదేపా, జనసేన, వామపక్షాల నిరసన దీక్ష

రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టాయి విపక్షాలు. దీక్షలో తెదేపా, జనసేన, వామపక్షాలు పాల్గొన్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశాయి.

akhilapaksham-protest-for-amaravathi
akhilapaksham-protest-for-amaravathi

రైతులకు మద్దతుగా తెదేపా,జనసేన, వామపక్షాలు నిరసన దీక్ష

రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా, జనసేన, వామపక్ష నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి... రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని రైతులకు తామూ అండగా ఉంటామని స్థానిక రైతులు తెలిపారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణి మంచిది కాదంటూ హెచ్చరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details