ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీ కొట్టిన ఆటో.. ఇద్దరు మృతి - latest news of guntur accidents

బంధువు మరణించగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తిరుగు ప్రయాణమైన వారు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టగా.. ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

a auto dashed lorry in guntur dst 2died 6 injured
లారీని డీకొట్టిన ఆటో..ఇద్దరు మృతి

By

Published : Apr 14, 2020, 12:37 PM IST

Updated : Apr 16, 2020, 7:01 AM IST

గుంటూరు జిల్లా ఈపూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ బంధువు మృతి చెందగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వీరంతా.. స్వగ్రామం ఏటుకూరుకు తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆటో డ్రైవర్ అంకారావు (38), అతని తండ్రి చిన్న అబ్బాయి (64) గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Apr 16, 2020, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details