ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 9, 2021, 2:36 AM IST

ETV Bharat / state

రెండు లారీలు ఢీ: ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

గుంటూరులోని డీజీపీ కార్యాలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

accident at guntur dgp office
డీజీపీ కార్యాలయం ఎదుట రెండు లారీలు ఢీ

గుంటూరు జిల్లా డీజీపీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం లారీ నుంచి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details