ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 28, 2020, 9:18 PM IST

ETV Bharat / state

తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో అనిశా తనిఖీలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రెండో రోజూ అనిశా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ సోదాలు జరిగాయి. అంబులెన్స్ రాకపోకల ఖర్చుల పేరుతో ఆస్పత్రి అధికారులు రూ.4 లక్షలు స్వాహా చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన 3 వేల మందికి రెండేళ్లుగా చెల్లింపులు నిలిపివేశారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల నుంచి శిక్షణ తీసుకున్నట్లు నకిలీ ధ్రువపత్రాల సృష్టించి.. అక్రమాలకు పాల్పడిన వారిపై అనిశా ఏఎస్పీ సురేశ్‌బాబు విచారణ జరుపుతున్నారు.

acb raids in tenali government hospital
తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో అనిశా తనిఖీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details