గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని మిలటరీ కాలనీలో దారుణం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఓ యువతి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
SUICIDE: పిడుగురాళ్లలో దారుణం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య - guntur district crime
![SUICIDE: పిడుగురాళ్లలో దారుణం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12779859-789-12779859-1629015573031.jpg)
ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య
12:42 August 15
పోలీసుల దర్యాప్తు
ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య
పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ బండారు శ్రావణ్ కుమార్ భార్య మానస (27) ఈరోజు ఉదయం తన ఇద్దరు పిల్లలు షర్మిల (3), జ్యోతిర్మయి (2)లకు ఉరివేసి.. తాను కూడా ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
Murder: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన దుండగుడు
Last Updated : Aug 15, 2021, 3:48 PM IST