ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు సర్వజనాసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

గుంటూరు సర్వజన ఆసుపత్రిలో 75 ఏళ్ల వృద్ధురాలికి వైద్యులు అరుదైన చికిత్స నిర్వహించారు. గుండెకు పేస్ మేకర్ అమర్చి  కేవలం కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే కాదు...ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఇది సాధ్యపడుతుందని నిరూపించారు.

By

Published : Jul 2, 2019, 6:12 AM IST

అరుదైన శస్త్రచికిత్స

గుంటూరు సర్వజనఆసుపత్రిలో వైద్యులు అరుదైన చికిత్స నిర్వహించారు. ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన 75 ఏళ్ళు రంగమ్మ అనే వృద్ధురాలికి స్టంట్ తర్వాత పేస్ మేకర్ అమర్చరారు. ఈ విదమైన శస్త్రచికిత్స చేయటం ఈ ఆసుపత్రిలో ఇదే మెుదటిసారి. గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎన్. శ్రీకాంత్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి మొదట రక్తనాళానికి స్టంట్ వేశారు. అనంతరం పేస్ మేకర్ సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం కావటం పట్ల డాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్స్ డే రోజు రంగమ్మ ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అరుదైన శస్త్రచికిత్స

ABOUT THE AUTHOR

...view details