ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసుల చెంతకు.. వైకాపా నేత మిల్లు లీజు గొడవ

ఓ మిల్లులోని యంత్రాలను ఎవరికి చెప్పకుండా వైకాపా నేత దౌర్జన్యంగా తరలించేందుకు ప్రయత్నించాడని మిల్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు.. తాను ఇచ్చిన లీజు గడువు ముగిసిందని వైకాపా నేత రమేష్ చెప్పారు.

By

Published : Mar 8, 2020, 8:20 PM IST

Published : Mar 8, 2020, 8:20 PM IST

a person case on  State ysrcp Secretary    at guntur
యంత్రాలను తరలిస్తున్న దృశ్యం

పోలీసుల చెంతకు.. మిల్లు లీజు గొడవ

తనపై వైకాపా నాయకుడు మిట్టపల్లి రమేష్ దౌర్జన్యం చేశాడని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఎంవీఎస్ గుప్తా ఆరోపించారు. రమేష్ కు చెందిన మిల్లును తాను 2008లో లీజుకు తీసుకున్నానని.. సొంతంగా యంత్రాలు బిగించుకుని వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పారు. లీజు గడువు ముగియగా.. మరి కొంత కాలం ఇవ్వాలని తాను చేసిన విజ్ఞప్తికి రమేష్ అంగీకరించినట్టు తెలిపారు. కానీ.. తనకు తెలియకుండా.. ఉన్న ఫళంగా యంత్రాలు తరలించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను ఊరిలో లేనప్పుడు ఇలా చేశారని ఆవేదన చెందారు. వేరొకరికి మిల్లును విక్రయించినట్టు తెలియగా.. గుంటూరు రూరల్ ఎస్పీ, ఐజీ, డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయాలలో ఫిర్యాదు చేశానన్నారు. తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించగా ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చినా... కోర్టు ఆదేశాలను ధిక్కరించి మిల్లులోని సామగ్రిని తరలించేయత్నం చేశారని వాపోయారు.

ఈ విషయమై వైకాపా నేత మిట్టపల్లి రమేష్​ను వివరణ కోరగా.. గుప్తాకు ఇచ్చిన లీజు గడువు ముగిసిందన్నారు. యంత్రాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ పత్రాలు కూడా శిక్షణ డీఎస్పీకి అందజేశానని చెప్పారు.

ఈ విషయమై శిక్షణ డీఎస్పీ మాధవరెడ్డిని వివరణ కోరగా ఇరువురి వాదనలు విన్నానన్నారు. డాక్యుమెంట్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చూడండి:

సీఏఏకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో భారీ ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details