ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడికి వెళ్లి వచ్చే లోపు ఇల్లు గుల్ల! - Tadepalli latest news

గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతన సంవత్సరం తొలిరోజు ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. విలువైన ఆభరణాలను అపహరించారు. తాము గుడికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయని బాధితులు తెలిపారు.

theft-took-place-in-thadepalli-
theft-took-place-in-thadepalli-

By

Published : Jan 2, 2021, 4:34 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. ఆశ్రమం రోడ్డులో అపూర్వ అపార్ట్​మెంట్​లోని విశ్రాంత ఈఈ సత్యనారాయణ ఇంట్లో వజ్రాలు పొదిగిన 200 గ్రాముల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. గుడికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. చోరికి గురైన ఆభరణాల విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details