ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

By

Published : Jun 16, 2021, 10:48 AM IST

దుస్తులు ఆరవేస్తుండగా తాడు నుంచి విద్యుత్ ప్రసారం అయి ఓ వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఈ ప్రమాదం జరిగింది.

current shock
విద్యుత్ ప్రమాదం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన కొలకలూరి అచయ్య కుటుంబం కొన్నాళ్లుగా పిరంగిపురంలో ఉంటున్నారు. దుస్తులు ఆరవేసేందుకు బయట ఉన్న విద్యుత్ స్తంభం నుంచి.. ఇంటి లోపలికి తాడు కట్టాడు.

ఈ క్రమంలో దండెంపై బట్టలు ఆరవేస్తుండగా.. విద్యుత్ ప్రవహించి షాక్​ కొట్టింది. వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుడికి భార్య..ఇద్దరు మగ పిల్లలు,ఒక ఆడ పిల్ల ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details