ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నడిరోడ్డుపై భార్య తల నరికి చంపిన భర్త - సత్తెనపల్లిలో మహిళ హత్య

మద్యం మత్తులో ఉన్న అతనిలో మృగం నిద్రలేచింది. చిన్నపాటి గొడవకే అత్యంత క్రూరంగా భార్యను కత్తితో నరికి చంపాడు.

A MAN KILLED HIS WIFE BY CUT OFF HER HEAD
A MAN KILLED HIS WIFE BY CUT OFF HER HEAD

By

Published : Jul 22, 2020, 11:49 AM IST

Updated : Jul 22, 2020, 3:23 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎన్‌ఎస్‌పీ కాలనీలో దారుణం జరిగింది. తాగిన మైకంలో భార్యను తల నరికి చంపాడు ఓ భర్త. ఎన్​ఎస్​పీ కాలనీకి చెందిన అంకమ్మ, శ్రీనివాసరావు భార్యభర్తలు. శ్రీనివాసరావు మంగళవారం రాత్రి తాగి ఇంటికి వెళ్లి.. భార్యతో గొడవపడ్డాడు. అతని వేధింపులు భరించలేక తాను పోలీసు స్టేషన్​కు వెళ్తానంటూ అంకమ్మ బయలుదేరింది. ఆగ్రహంతో రగిలిపోయిన శ్రీనివాసరావు నడిరోడ్డుపై కత్తితో భార్య తల నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై ఉన్న మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. దారుణానికి ఒడిగట్టిన శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో లష్కర్​గా పని చేస్తున్నాడు.

Last Updated : Jul 22, 2020, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details