గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని రచ్చమల్ల పాడుకి చెందిన నాగేశ్వరి, మంగమ్మ, వెంకటేశ్వర్లు ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురయ్యారు. వారి మానసిక పరిస్థితిలో మార్పు వచ్చింది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించారు. అందుకు కారణం చేతబడి అని వారు భావించారు. దీంతో అదే గ్రామానికి చెందిన సూదుల ఆంజనేయులు అనే వ్యక్తి పై అనుమానం పెంచుకున్నారు.
ఆ ముగ్గురికి చేతబడి చేసి... ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఊర్లో జనాలు నమ్మారు. వెంటనే గ్రామంలోని కొందరు కలిసి... ఆంజనేయులు ఉండే ప్రాంతానికి వెళ్లారు. చేతబడికి విరుగుడు చేయమని అతన్ని అడిగారు. ఏమి స్పందించక పోవడంతో... ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు.