ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో కొత్తగా 451 కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో కొత్తగా 451కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57 వేల 339కి చేరుకుంది. మహమ్మారి కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 536మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో ఉంది.

By

Published : Oct 2, 2020, 8:37 PM IST

451 new corona positive cases regsitered in guntur diatrict
గుంటూరులో కొత్తగా 451కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో కొత్తగా 451 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 57 వేల 339కి చేరుకుంది. కొత్త కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 62, మంగళగిరిలో 59 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలో 42, సత్తెనపల్లిలో 26, చేబ్రోలులో 22, ముప్పాళ్లలో18, నాదెండ్లలో 18, వినుకొండసో 15, నకరికల్లులో 14, పెదకూరపాడలో 13, రెంటచింతలలో 12, తెనాలిలో 12, కొల్లిపొరలో 10 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 128 కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 49వేల 695 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 536కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details