గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో అనధికారికంగా భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం(pds rice seized at guntur)ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పెనుమూడి గ్రామ సమీపంలో ఉన్న ఓ పాత ఇంటిని గోడౌన్గా మార్చి అనధికారికంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచారు. పక్కా సమాచారంతో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు గోడెన్పై దాడులు నిర్వహించారు. సుమారు 354 బస్తా(354 bags rations rice seized)ల్లో ఉన్న 172 క్వింటాళ్ల బియ్యం(pds rice) స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ శ్రీహరి వెల్లడించారు. ఈ వ్యవహారంలో రాధాకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు విజిలెన్స్ సీఐ తెలిపారు.
PDS RICE SEIZED: 172 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - 354 bags rations rice seized
గుంటూరు జిల్లా రేపల్లె మండల పరిధిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 172 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం(pds rice seized at repalle) చేసుకున్నారు. ఈ కేసులో నిందితునిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ శ్రీహరి వెల్లడించారు.
![PDS RICE SEIZED: 172 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత pds rice seized at guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13231673-187-13231673-1633096921552.jpg)
రేపల్లె మండలంలో రేషన్ బియ్యం పట్టివేత