గుంటూరు ప్రభుత్వ మహిళ కళాశాల వసతి గృహంలో ఆహారం వికటించి20విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వసతి గృహంలో ఉంటున్న ఇంటర్,డిగ్రీ విద్యార్ధులు మధ్యాహ్నం కోడికూరను తిన్నారు.భోజనం చేసిన వారు ఒక్కసారిగా కడుపు నొప్పి,తలనొప్పి,కళ్ళు తిరగడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.వంటకు బ్లీచింగ్ అధిక గాఢత ఉన్న నీటిని వాడటం వల్ల,కూరలో శనగపిండి కలపడం వల్ల ఆహారం వికటించిందని విద్యార్ధులు తెలిపారు.విద్యార్ధుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.తమ ఆరోగ్యంపై వార్డెన్,ఇతర అధికార్లు ఎవరు వాకబు చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వ కళాశాల వసతి గృహంలో ఆహారం వికటించి 20మంది అస్వస్థత - 20 people sick by eating contaminated food in hostel
ప్రభుత్వ మహిళ కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 20మంది విద్యార్ధులు అస్వస్థతకు గురైన సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
![ప్రభుత్వ కళాశాల వసతి గృహంలో ఆహారం వికటించి 20మంది అస్వస్థత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4525583-932-4525583-1569231618891.jpg)
govrnment welfar hosteil in guntur