తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 43 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 272కి చేరింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 228 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని ప్రభుత్వం తెలిపింది.
మర్కజ్ ప్రభావం..
ఇటీవల నమోదైన పాజిటివ్ కేస్లు అన్ని మార్కజ్ నుంచి వచ్చినవారు, వారిని కలిసిన వారివేనని ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్, సికింద్రాబాద్లో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారు కూడా.. దిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తులను కలిసిన వారేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మర్కజ్ నుంచి 1090 మంది వచ్చారని... వాళ్లందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.