ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కీసర గట్టు చెరువు అంచున కాలువలో శిశువు మృతదేహం

By

Published : Jul 24, 2022, 4:39 PM IST

Dead body: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కీసర గట్టు చెరువు వద్ద దారుణం నెలకొంది. చెరువు అంచున కాలువలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మగబిడ్డను వదిలేశారు. గుర్తించిన స్థానికులు.. పోలీసులు సమాచారమివ్వగా అప్పటికే శిశువు మరణించినట్లు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తరలించారు.

baby boy dead body found at keesara gattu lake in eluru
కీసర గట్టు చెరువు అంచున కాలువలో శిశువు మృతదేహం


Dead body: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కీసర గట్టు చెరువు అంచున కాలువలో.. ఓ మగశిశువును పడేశారు. రైతు గంగరాజు శిశువు మృతదేహాన్ని గుర్తించి.. స్థానికులకు, పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రాంతీయాసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికుల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో పడేసి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. దీంతో మృతదేహం చెరువు తూము వద్దకు కొట్టుకు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసారు.

ఇవాళ ఉదయం రైతు గంగరాజు తూము నుంచి నీటిని వదిలేందుకు రాగా.. అక్కడ శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. రెండు, మూడు రోజులుగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల వివరాలను సేకరిస్తున్నట్లు.. ఎస్సై సాగర్ బాబు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details