ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాం రాజకీయం రసవత్తరం.. ప్రచారంలో వైకాపా ముఖ్య నేతలు! - యానాం ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు న్యూస్

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికలు.. ఆ రాష్ట్ర ప్రజలతోపాటు మన రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. వైకాపా ముఖ్యనేతలు సైతం యానాం వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఓటమి ఎరుగని నేతగా ఉన్న మల్లాడి కృష్ణారావు పోటీకి దూరంగా ఉండి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామికి మద్దతివ్వడం ఆసక్తి రేపుతోంది.

యానాం రాజకీయం రసవత్తరం.. ప్రచారంలో వైకాపా ముఖ్యనేతలు!
యానాం రాజకీయం రసవత్తరం.. ప్రచారంలో వైకాపా ముఖ్యనేతలు!

By

Published : Mar 30, 2021, 5:17 PM IST

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి మన రాష్ట్రానికి తాకుతోంది. ఐదుసార్లు యానాం నుంచి గెలిచిన మల్లాడి కృష్ణారావు పోటీ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఆయన మాజీ ముఖ్యమంత్రి రంగస్వామికి మద్దతిచ్చారు.

సుమారు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనపై పోటీ చేస్తున్నది నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు. వారంతా 30 ఏళ్ల లోపు వారే. రంగస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.. మల్లాడి కృష్ణారావు కృషి చేస్తున్నారు. మరోవైపు ఆయన సీఎం జగన్​కు ఆప్తుడు. ఈ కారణంగా.. వైకాపా ఎంపీ పిల్లి సుభాష్​ చంద్రబోస్, మంత్రి వేణుగోపాల కృష్ణ.. యానాంలో వివిధ సంఘాల నేతలతో సమావేశమయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details