రేషన్ లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ - రావులపాలెంలో సేవా థృక్పథాన్ని చాటుకుంటున్న యువత
కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు తమ వంతు సాయంగా ప్రజలకు సాయం అందిస్తున్నారు.

రేషన్ లబ్ధిదారులకు అల్పహార పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో లాక్డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు తమ వంతు సహాయాన్ని ప్రజలకు అందిస్తున్నారు. పట్టణానికి చెందిన కూరి రాజేశ్, దొండపాటి పసవయ్య , వీర్రాజులు తమ వంతు సాయంగా పట్టణంలో రేషన్ దుకాణాల వద్ధ గంటల తరబడి నిరీక్షించే ప్రజలకు అల్పాహారాన్ని అందిస్తు వారి సేవా ధృక్పథాన్ని చాటుకున్నారు.