ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడిపందేల కారణంగా యువకుడు మృతి.. కుటుంబీకుల ధర్నా! - died person Relatives held a dharna with dead body in Ramachandrapuram

కోడిపందేల కారణంగా మరణించిన ఓ యువకుని కుటుంబసభ్యులు ధర్నా చేపట్టారు. కోడి పందెలు ఆడుతుండగా.. పోలీసులు తరమటం వల్లే తమ కుటుంబీకుడు మృతి చెందాడని వారు ఆరోపించారు.

young man died due to hen fight
కోడిపందెల కారణంగా యువకుడు మృతి

By

Published : Jul 5, 2021, 10:40 PM IST

తూర్పు గోదావరి జిల్లా కె.గంగవరం మండలం కుడుపూరు గ్రామంలో కోడి పందాల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ముగ్గురు పందెం రాయుళ్లు కాలువలోకి దూకేశారు. వీరిలో ఆకుల రమేశ్​ (25) అనే యువకునికి ఈత రాకపోవడంతో మురుగు కాలువలో మునిగిపోయాడు. పోలీసులు వెంటనే నాటుపడవలపై గాలించగా.. అతని మృతిదేహం లభించింది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

అయితే... మృతుని కుటుంబ సభ్యులు అడ్డుకొని ధర్నా చేపట్టారు. పోలీసులు తరమటం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని.. రమేశ్ తండ్రి ఆరోపించాడు. తమకు న్యాయం జరిగే వరకు కదలబోమని నినాదాలు చేశారు. అనంతరం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, ఇన్చార్జ్​ సీఐ భాస్కర రావు ఆందోళనకారులతో చర్చలు జరిపటంతో ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details