ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రి కార్యాలయ ముట్టడికి కార్మికుల యత్నం... అడ్డుకున్న పోలీసులు

By

Published : Nov 17, 2020, 3:44 PM IST

అమలాపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు మంత్రి పినిపే విశ్వరూప్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

మంత్రి కార్యాలయ ముట్టడికి కార్మికుల యత్నం...అడ్డుకున్న పోలీసులు
మంత్రి కార్యాలయ ముట్టడికి కార్మికుల యత్నం...అడ్డుకున్న పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులు నిరసన చేపట్టారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కొనసాగించాలని, పెండింగ్ క్లెయిమ్​లు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొంత మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి:

నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడు !

ABOUT THE AUTHOR

...view details