ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వివాహిత అనుమానాస్పద మృతి..అత్తింటి వారిపైనే తల్లిదండ్రుల అనుమానం

By

Published : Feb 6, 2021, 10:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా టిల్లకుప్ప గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

woman suspected death in tillakuppa east godavari district
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం టిల్లకుప్ప గ్రామానికి చెందిన రమ్య అనే వివాహిత... ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ అమ్మాయిని అత్తింటివారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details