తూర్పుగోదావరి జిల్లా తునిలో మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతు బజార్ను దాడిశెట్టి రాజా ప్రారంభించారు. లాక్డౌన్తో ప్రజల విద్యుత్ వినియోగం పెరిగిందని.. దీనివల్లే.. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అంతేగానీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని రాజా ఆరోపించారు.
'వినియోగించిన విద్యుత్కే బిల్లులు వస్తున్నాయి' - విద్యుత్ బిల్లులపై దాడిశెట్టి రాజా కామెంట్స్
విద్యుత్ ఛార్జీలు పెంచారని, విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని తెదేపా నాయకులు పుకార్లు సృష్టించి రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగించిన విద్యుత్కే బిల్లు వస్తుందని స్పష్టం చేశారు.

wip dhadishetti raja on electriciry bill
ఇదీ చదవండి: 'వ్యవసాయ కార్యకలాపాలకు ఇబ్బంది కలగొద్దు'