ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్డీవో వీల్లేదన్నారు... పోలీసులు వదిలేశారు!

By

Published : May 13, 2020, 6:26 PM IST

కరోనా పాజిటివ్​ కేసులు నమోదవుతుండడంపై సంపూర్ణ లాక్​డౌన్ విధిస్తూ, మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ఆర్డీవో స్పష్టం చేశారు. అయినా సరే మద్యం షాపులు తెరిచి అమ్మకాలు మెుదలుపెట్టినా పోలీసులు అడ్డుకోలేదు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో జరిగింది.

wine shops opens in konaseema
కోనసీమలో తెరుచుకున్న మద్యం దుకాణాలు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఆ ప్రాంత పరిధిలో ఐదుగురికి కరోనా సోకిన కారణంగా.. సంపూర్ణ లాక్​డౌన్ విధస్తున్నట్లు అమలాపురం ఆర్డీవో భవానీ శంకర్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ క్రమంలో మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించారు. కానీ.. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా దుకాణాలు తెరుచుకున్నాయి.

ఎక్సైజ్ అధికారులు ఫోన్​ చేసి దుకాణాలు తెరవమన్నారనీ, అందుకే తెరిచామని సేల్స్ మెన్ చెప్పారు. నిత్యావసర దుకాణాలు మాత్రం 10 గంటలకే పోలీసులు మూసివేయించారు. 10 గంటల తరువాత ఇంటి బయట ఎవరు కనిపించినా కేసులు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు... మద్యం షాపులు తెరచి విక్రయాలు జరుపుతున్నా మాట్లడకపోవటం విమర్శలకు కారణమైంది.

ABOUT THE AUTHOR

...view details