తుపాను బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి భరోసా ఇచ్చారు. కొత్తపేట మండలం పలివెల శివారు పూజారి పాలెం ముంపునకు గురవగా.. ఆయా ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పర్యటించారు. అనంతరం బాధితుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.
తుపాను బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే జగ్గిరెడ్డి - Pujaari Palem Latest News
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల శివారు పూజారి పాలెం ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి బాధిత ప్రాంతంలో పర్యటించారు. అనంతరం తుపాను బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
![తుపాను బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తుపాను బాధితులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9176123-748-9176123-1602688123437.jpg)
తుపాను బాధితులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి