ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2020, 9:01 PM IST

ETV Bharat / state

ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం: ఎమ్మెల్యే పొన్నాడ

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్​లో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ పర్యటించారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి గ్రామ సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా ఆరోగ్యం వివరాలతో కూడిన నివేదికను తయారు చేస్తున్నామని చెప్పారు.

ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం : ఎమ్మెల్యే పొన్నాడ
ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం : ఎమ్మెల్యే పొన్నాడ

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఆశయమని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్​లో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి గ్రామ సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా ఆరోగ్యం వివరాలతో కూడిన నివేదికను తయారు చేస్తున్నామన్నారు. అందరికీ వ్యక్తిగత ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని చెప్పారు.

భూమి పూజ..

నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలను విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముమ్మడివరం కొత్తలంకలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఇవీ చూడండి:

తమిళకూలీల మృతికి కారణమైన స్మగ్లర్‌ బాషాభాయ్‌ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details