ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2021, 9:08 PM IST

ETV Bharat / state

Maoist: 'కరోనా లక్షణాలు ఉన్న మావోయిస్టులకు చికిత్స అందిస్తాం'

మావోయిస్టులకు (maoist) కరోనా సోకడంపై విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలో ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహించకూడదని కోరారు.

Maoist : 'కరోనా లక్షణాలు ఉన్న మావోయిస్టులకు చికిత్స అందిస్తాం'
Maoist : 'కరోనా లక్షణాలు ఉన్న మావోయిస్టులకు చికిత్స అందిస్తాం'

మావోయిస్టు నాయకులు, దళ సభ్యులు, మిలీషియా సభ్యులకు కరోనా సోకితే వారికి చికిత్స అందిస్తామని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలు ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. కొవిడ్ సోకి పలువురు మావోయిస్టు నేతలు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిర్లక్ష్యంతో క‌రోనా బాధితులను నిర్బంధంలో ఉంచి వారి ప్రాణాల‌తో ఆడుకోవ‌ద్ద‌ని కోరారు. మావోయిస్టులతో పాటు ఏవోబీలోని గిరిజ‌నులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details