కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులను అనుమతించవద్దని వాడపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పేరుపొందిన గుడి కనుక ఎక్కడెక్కడినుంచో ప్రజలు వస్తుంటారని.. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి అధికమవుతుందంటూ వారు భయాందోళన వ్యక్తం చేశారు. గ్రామం మధ్యలో ఆలయం ఉండడం వలన మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం మరికొన్ని రోజులు దర్శనాలు నిలిపివేయాలని కోరుతున్నారు.
'మా ఊరి గుడిలో ఇప్పుడే దర్శనాలు వద్దు' - వాడపల్లిలో గ్రామస్థుల ఆందోళన వార్తలు
లాక్డౌన్ సడలింపులతో రాష్ట్రంలోని దేవాలయాలన్నీ తెరుచుకున్నాయి. అయితే తమ గ్రామంలోని గుడిలో దర్శనాలకు అనుమతి ఇవ్వొద్దంటూ.. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామస్థులు ఆందోళన చేశారు.
!['మా ఊరి గుడిలో ఇప్పుడే దర్శనాలు వద్దు' villagers protest in vaadapalli east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7526068-779-7526068-1591603356646.jpg)
వాడపల్లిలో గ్రామస్థుల ఆందోళన