ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు, వ్యాన్ ఢీ.. దంపతులు మృతి - vijayawada wife and husband dead in kuyuguru car, van accident

తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం కుయుగూరులో కారు, వ్యాన్ ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో దంపతులు మరణించారు. విజయవాడ కానూరులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ భరతం సత్యనారాయణ, ఆయన భార్య హారతి ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంక్రాంతి సెలవులకు ఒడిశాలోని వారి స్వగ్రామం నవరంగపుర్​కు వెళుతుండగా ఘటన జరిగిందని పేర్కొన్నారు.

accident at kuyuguru
కుయుగూరులో రోడ్డు ప్రమాదం, దంపతులు మృతి

By

Published : Jan 10, 2021, 6:43 AM IST

ఎదురెదరుగా రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. విజయవాడ నుంచి ఒడిశా వెళుతున్న కారు, ఒడిశా నుంచి చింతూరు వస్తున్న వ్యాన్​ను ఢీ కొట్టింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కుయుగూరులోో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ కానూరులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్​లో జనరల్ మేనేజర్​గా పనిచేస్తున్న భరతం సత్యనారాయణ, ఆయన భార్య హారతి మరణించారు.

సంక్రాంతి సెలవులకు స్వగ్రామమైన ఒడిశాలోని నవరంగపూర్​కు కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం చింతూరులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో.. బ్యాంక్ ఉద్యోగి సత్యనారాయణ మృతి చెందారు. ఆయన భార్య హారతిని భద్రాచలంలో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details