ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. డ్రైవర్ అరెస్ట్​ - పోలీసుల అదుపులో రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి.. డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

vehicle drive in police custody
రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనం సీజ్, పోలీసులు అదుపులో డ్రైవర్

By

Published : Mar 7, 2021, 6:25 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన అనంతరం ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించినట్లు పి.గన్నవరం ఎస్​ఐ సురేంద్ర వివరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి నుంచి మెటల్ లోడుతో.. మామిడికుదురు మండలం నగరం గ్రామం వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి కారణమైనట్లు గుర్తించారు. డ్రైవర్ వాహనం నడుపుతున్న సమయంలో చరవాణిలో మాట్లాడుతున్నట్టు ఉందని పోలీసులు పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ వర్ధనపు శ్రీనివాస్​ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నామని సురేంద్ర వెల్లడించారు.

ఇవీ చూడండి...

స్కూటీని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం... ఇద్దరు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details