లాక్డౌన్ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశ్యంతో ఓ హోటల్ యజమాని కూరగాయలు పంచిపెట్టాడు. అతనే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటరత్నం హోటల్ యజమాని బాలాజీ. గ్రామంలో గణేష్, భవానీ కాలనీల్లో 250 పేద కుటుంబాలకు కూరగాయలు అందించారు. పేద ప్రజలు పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు బాలాజీ వివరించారు.
పేద ప్రజలకు కూరగాయల పంపిణీ
రోజు కూలీలకు ఇప్పుడు పూట గడవటమే కష్టంగా ఉంది. అటువంటి పేద ప్రజలకు కూరగాయలు అందిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటరత్నం హోటల్ యజమాని.
పేద ప్రజలకు కూరగాయల పంపిణీ