ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదిలో.. 80 మీటర్ల లోతులో బోటు? - ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం కనుగొంది

గోదవరిలో మునిగిన బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గుర్తించింది. సోనార్ సిస్టమ్ ద్వారా 70 నుంచి 80 మీటర్ల లోతులో బోటు ఉన్నట్లు తేల్చింది.

దొరికిన బోటు జాడ...

By

Published : Sep 18, 2019, 4:26 PM IST

తూర్పుగోదావరి జిల్లా పాపికొండల్లో మునిగిన బోటు జాడ దొరికింది. సోనార్ సిస్టమ్ ద్వారా 70 - 80 మీటర్ల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం ఈ దిశగా చేసిన ప్రయత్నం సఫలమైందని ఆ రాష్ట్ర ఇన్‌స్పెక్టర్‌ జితేంద్రజోషి వెల్లడిచారు. అక్కడి నుంచి బోటును బయటికి తీయడమెలా అన్న విషయంపైనే అధికారులు దృష్టి పెడుతున్నారు. మరోవైపు.. బోటులో ఇంకా మృతదేహాలు ఏమైనా ఉంటే వాటినీ జాగ్రత్తగా వెలికి తీసేందుకు అవసరమైన చర్యలపై సహాయబృందాలు కసరత్తు చేస్తున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details