ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తోరగపాయకు కొట్టుకు వచ్చిన వృద్ధురాలి మృతదేహం - thoragapaya unidentified dead body

తూర్పు గోదావరి జిల్లా తోరగపాయ వద్దకు సుమారు 70 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

unidentified dead body
తోరగపాయకు కొట్టుకు వచ్చిన వృద్ధురాలి మృతదేహం

By

Published : Aug 18, 2020, 7:39 AM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట బోడిపాలెం వంతెన సమీపంలో.. గోదావరి తోరగపాయ వద్దకు ఓ వృద్ధురాలి మృతదేహం కొట్టుకువచ్చింది. గోదావరికి వరద నీరు ఎక్కువగా రావటంతో.. బోడిపాలెం వంతెన వద్ద తోరగపాయ ఉద్ధృతంగా ప్రహిస్తోంది. ఈ ప్రవాహంలో ఎక్కడ నుంచి కొట్టుకువచ్చిందో సుమారు 70 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం వంతెన తుప్పలకు అడ్డుతగిలి ఉండిపోయింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details