తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన న్యాయవాది సుభాష్చంద్రబోస్ అదృశ్యం కేసుకు సంబంధించి ఏలేశ్వరం ఎస్సై సుధాకర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయవాది సుభాష్చంద్రబోస్ను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు అర్ధరాత్రి దాటాక తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చి అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారంటూ ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బోస్ భార్య పి.వెంకటప్రియదీప్తి ఇటీవల హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి.. హైకోర్టులో హాజరు కావాల్సి వచ్చింది. బోసును తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.