ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి - road accident in murari

రహదారి డివైడర్​ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగింది.

Two friends died   in road accident at Murari
ఇద్దరు స్నేహితులు

By

Published : Apr 12, 2020, 8:54 AM IST

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన సూర్యసిద్ధు, అతని స్నేహితురాలు ద్విచక్రవాహనంపై జగ్గంపేట నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నారు. ఇదే క్రమంలో బైక్​ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. సూర్యసిద్దు మార్గమధ్యలోనే మృతి చెందాడు. అతని స్నేహితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details