ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తొండంగి గ్రామస్థులకు జనసేన అండగా ఉంటుంది'

By

Published : Dec 12, 2020, 5:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో దివిస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలంటూ స్థానిక రైతులు డిమాండ్​ చేస్తున్నారు. విశాఖలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణలను కలిసి తమకు మద్దతివ్వాలని కోరారు.

tondagi farmers
జనసేన నాయకులను కలిసిన తొండంగి రైతులు

తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో దివిస్​ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల దాదాపు నలభై గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని రైతులు అంటున్నారు. తమకు మద్దతివ్వాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులను విశాఖలో కలిసి కోరారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లామని.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదని వాపోయారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు హామీ ఇచ్చిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫ్యాక్టరీ వస్తే రైతుల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారుతుందని తమ గోడును వెలిబుచ్చుకున్నారు. పచ్చని పొలాలు ఉన్న తొండంగిలో ప్రభుత్వం కారుచిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివిస్​ పరిశ్రమ వల్ల పర్యావరణం, ప్రజల జీవనాధారం, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటాయని జనసేన నేత శివశంకర్ అన్నారు. ధనం, అధికార బలంతో వైకాపా వ్యహహరిస్తుందని మండిపడ్డారు. గ్రామ ప్రజలకు, రైతులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:అగ్నికి వరి కుప్ప ఆహుతి.. రూ. లక్షన్నర నష్టం

ABOUT THE AUTHOR

...view details