ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

OMICRON CASES IN AP: రాష్ట్రంలో 4కు చేరిన ఒమిక్రాన్ కేసులు

By

Published : Dec 24, 2021, 10:04 AM IST

Updated : Dec 24, 2021, 12:30 PM IST

OMICRON CASE IN AP
OMICRON CASE IN AP

10:02 December 24

రాష్ట్రంలో 4కు చేరిన ఒమిక్రాన్ కేసులు

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు నాలుగుకు చేరాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈనెల 19న కువైట్‌ నుంచి విజయవాడకు చేరుకుంది. అక్కడినుంచి స్వస్థలం అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లింది. ఆమె నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్‌వో వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని.. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

విశాఖలో ఓ ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈ నెల 15న దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయ్యింది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచినట్లు స్పష్టం చేశారు. మరో 9 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:OMICRON CASE IN AP: రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదు

Last Updated : Dec 24, 2021, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details