ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ఆలయాల్లో చోరీ.. నగదు మాయం - east godavari latest news

తూర్పు గోదావరి జిల్లాలోని 2 ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. హుండీలు బద్దలు కొట్టి నగదును దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దొంగలు ధ్వంసం చేసిన హుండి
దొంగలు ధ్వంసం చేసిన హుండి

By

Published : Oct 4, 2020, 2:56 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని కూనవరం, పెద్దమంద గ్రామాల్లో ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు రెండు ఆలయాల్లోని హుండీలను బద్దలుకొట్టి డబ్బులను అపహరించుకుపోయారు.

ఆ సమయంలో స్థానికులు కేకలు వేయగా... దొంగలు ద్విచక్ర వాహనాన్ని వదిలేసి పారిపోయారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై కృష్ణమాచారి సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details