ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 28, 2021, 10:57 AM IST

ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో మందుబాబులు చోరీ

దొంగతనం చేయాలనే ఆలోచన ఉంటే చాలు.. ఎక్కడైనా దోచేసేస్తారు దొంగలు. అది ప్రభుత్వానికి చెందిందైనా.. ప్రైవేటు వాళ్ల ఆస్తి అయినా లెక్క చేయరు. తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణానికే దొంగలు కన్నమేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.

liquor Theft
మద్యం చోరీ

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని అమలాపురం రోడ్​లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో రాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.. కాపలదారుడిని కత్తులతో బెదిరించి దుకాణం తాళాలను పగలగొట్టారు. ఆ సమయంలో నగదు కౌంటర్​లో డబ్బులు లేకపోవటంతో..రూ.20 వేలు విలువ చేసే మద్యం సీసాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details