ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఐటీఐ తరలింపుపై వ్యతిరేకత - కాకినాడ తాజా వార్తలు

సుదీర్ఘ చరిత్ర ఉన్న కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ తరలింపు చర్యను... వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ తూర్పు గోదావరి జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఐటీఐ రంగరాయ వైద్యకళాశాలకు కేటాయించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

SFI leaders opposed the decision to move the government ITI
ప్రభుత్వ ఐటీఐ తరలింపు పై వ్యతిరేకత

By

Published : Nov 17, 2020, 4:06 PM IST

ఎంతో చరిత్ర కలిగిన కాకినాడ ప్రభుత్వ ఐటీఐని తరలించాలన్న నిర్ణయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తూర్పు గోదావరి జిల్లా కమిటీ వ్యతిరేకించింది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొవాలని కోరుతూ ర్యాలీ చేశారు.

కేబినెట్‌ ఆమోదంతో విడుదలైన జీవో 347 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 1947లో ఏర్పడిన కళాశాలలో 1400 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. ఇక్కడి స్థలం వేరే సంస్థకు కేటాయించి విద్యార్థులతో చెలగాటం ఆడొద్దని విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details