ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 31, 2021, 4:59 PM IST

ETV Bharat / state

180 ఏళ్ల నాటి తాళపత్రాలు.. భాషా దినోత్సవం సందర్భంగా మళ్లీ వెలుగులోకి..!

తూర్పు గోదావరిజిల్లా రాజోలులో 180 ఏళ్ల క్రితం నాటి తాళపత్రాలను.. ప్రముఖ న్యాయవాది, గాంధేయవాది పొన్నాడ హనుమంతరావు ప్రదర్శించారు. ఇవి 1844వ సంవత్సరం నాటివని.. ఈ నాటి తరానికి తాళపత్రాలను పరిచయం చేసేందుకే బయటికి తీశానని చెప్పారు.

180 ఏళ్ల నాటి తాళపత్రాలను బయటకు తీసిన వ్యక్తి
180 ఏళ్ల నాటి తాళపత్రాలను బయటకు తీసిన వ్యక్తి

రాజోలులో 180 ఏళ్ల నాటి తాళపత్రాలు

తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన న్యాయవాది, గాంధేయవాది పొన్నాడ హనుమంతరావు.. 180 ఏళ్ల క్రితం నాటి తాళపత్రాలను ప్రదర్శించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీటిని ఈ తరానికి పరిచయం చేసేందుకే వెలుగులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఈ తాళపత్రాలను తన నివాసమైన గాంధీ హౌజ్ లో భద్రపరిచారు. 1844లో.. తమకు సంబంధించిన ఆస్తుల వివరాలను వీటిపై లిఖించారని.. తెలుగు సంవత్సరాల ప్రకారంగా ఇవి క్రోధి (1844)నామ సంవత్సరానికి చెందినవని.. హనుమంతరావు వివరించారు.

"మా తాత భానుమూర్తి. ఆయన తాతగారు గంగరాజు. 1859 కు ముందు కాలంలో మా తాత కరణంగా పని చేసేవారు. ఈ విషయాన్ని మా తండ్రి సూర్యారావు డైరీలో రాసుకున్నారు. ఈ తాళపత్రాలను మా తరతరాల సంపదగా భావిస్తున్నాం. ఏళ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్నాం. ప్రాచీన కాలంలో రామయణం, మహాభారతం వంటి గ్రంథాలను ఇలాంటి తాళపత్రాలపైనే లిఖించేవారు" - పొన్నాడ హనుమంతరావు, న్యాయవాది

ABOUT THE AUTHOR

...view details