ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెలకొరిగిన వందేళ్ల చెట్టు... ఆ వృక్షం కింద 8 మంది.. వారేమయ్యారు? - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

వందేళ్ల చెట్టు. గాలి లేదు.. వాన లేదు. అయినా ఎందుకు పడిపోయిందో తెలియదు. ఉన్నట్టుండి నేలకొరిగింది. పక్కనే ఉన్న తాటాకు ఇంటిపై పడిపోయింది. అందులో ఉన్న ఎనిమిమంది ఏమయ్యారంటే...!

The hundred-year-old tree collapsed at dharmavaram in prathipadu, east godavari district
తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో నెలకొరిగిన వందేళ్ల చెట్టు

By

Published : Jun 30, 2020, 8:16 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో 100 సంవత్సరాల చరిత్ర గలిగిన చెట్టు నేలకొరిగింది. ఎలాంటి గాలులు వీయకున్నా.. మర్రిచెట్టు పడిపోవడంవల్ల.... విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.

చెట్టు పక్కనే ఉన్న పూరిల్లుపై పడగా... అక్కడి స్థానికులంతా భయపడ్డారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎనిమిది మంది బయటకు పరుగులు తీశారు. ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details