ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

heavy rains: మన్యంలో భారీ వర్షాలు... కొట్టుకుపోయిన వంతెన - తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు

తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రంపచోడవరం మండలంలో వంతెన కొట్టుకుపోయింది. ఆ మార్గంలో వెళ్లే ఉపాధ్యాయులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

heavy rains
heavy rains

By

Published : Oct 8, 2021, 11:33 AM IST

తూర్పు గోదావరి జిల్లా మన్యంలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రంపచోడవరం మండలంలో వంతెన కొట్టుకుపోయింది. రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే గిరిజనులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాత్రి కురిసిన వర్షానికి వేములకొండ పంచాయతీ పందిరిమామిడి నుంచి వాడపల్లి వెళ్లే రహదారి లోనూ కొండ వాగులు పొంగి ప్రవహించాయి.

ABOUT THE AUTHOR

...view details