తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నాగుల్లంక గ్రామానికి చెందిన టెంట్హౌస్ నిర్వాహకుడు సేవా దృక్పథంతో ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. గ్రామాలలో కరోనా గురించి జోరుగా ప్రచారం చేస్తున్నాడు. పవన్ అనే యువకుడు వాహనానికి సౌండ్ బాక్సులు బిగించి.. ప్రధాని ప్రసంగం మొదలుకొని వివిధ సినీ గేయ రచయితలు రూపొందించిన పాటలను ప్రజలకు వినిపిస్తున్నాడు. కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రచారం చేస్తూ సామాజిక సేవ చేస్తున్నాడు.
'పాటలు వినండి.. కరోనాపై జాగ్రత్తపడండి' - కరోనాపై అవగాహన కల్పిస్తున్న టెంట్హౌస్ నిర్వాహకుడు
లాక్డౌన్ కారణంగా పెళ్లిల్లు జరగపోవడంతో తన వ్యాపారం దెబ్బతింది. ఖాళీగా ఉన్న అతని సామాన్లను కోరనా పోరుకి వాడేశాడు. 'పాటలు వినండి.. కోరనాపై జాగ్రత్త పండడి' అంటూ చైతన్యం కల్పిస్తున్నాడు.

Tent House manager educating to the people on corona virus at Nagul lanka in east godavari