ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపాది మోసపూరిత పరిపాలన' - tdp at east godavari district news

విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా పి.గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ నాయకులు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

telugu desam party leaders protest
డాక్టర్​ సుధాకర్​కు మద్దతుగా తెదేపా నేతల నిరసన

By

Published : May 18, 2020, 12:02 PM IST

వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసగిస్తూ పాలన సాగిస్తోందని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గంటి హరీష్​మాధూర్​ విమర్శించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పి.గన్నవరం మండల తెదేపా అధ్యక్షుడు పడాల వెంకటేశ్వరరావు దీక్ష చేపట్టారు.

దీక్షను హరీష్ మాధుర్ ప్రారంభించారు. ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ వైఫల్యం చెందుతుందన్నారు. ప్రభుత్వానిది మోసపూరిత పాలన అన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. విశాఖలో వైద్యుడితో పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details