ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పి. గన్నవరంలో ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

ఎస్​టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. విద్యార్థులకు వారి చేతులు మీదుగా పంచిపెట్టారు.

By

Published : May 15, 2020, 7:49 PM IST

teachers association given fruits to 500 students on behalf of mla kondeti chittibabu
పిల్లలకు పండ్లు పంచిపెడుతున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులకు ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. బెల్లంపూడిలోని ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ఎస్​టీయూ ఉపాధ్యాయ సంఘం విద్యార్థులకు ఈ విధంగా సేవా కార్యక్రమం అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చిట్టి బాబు అన్నారు. 'ది రియల్​ టీచర్​' పేరుతో ఈ సేవా కార్యక్రమాన్ని ఇతరులు సైతం స్వీకరించాలని ఎస్​టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కె వి శేఖర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఈ విధంగా పండ్లు పంపిణీ చేస్తామ్నారు. తాము తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details