తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చిన శంకర్లపూడి గ్రామానికి చెందిన తెదేపా బీసీ నాయకుడు ఏపూరి శ్రీనివాస్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై 10 రోజుల క్రితం అరెస్టు అయిన శ్రీనివాస్.. బెయిల్పై విడుదల అయ్యారు. శ్రీనివాస్కు మద్దతుగా.. చిన్నశంకర్లపూడిలో గ్రామస్థులు, తెదేపా శ్రేణులు రోడ్ పై బైఠాయించారు. ఎస్సై రవికుమార్పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో శ్రీనివాస్కు సంఘీభావంగా తెదేపా శ్రేణులు ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఎస్సై రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేశారు. బీసీలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని వరుపుల రాజా ఆరోపించారు.
'అక్రమ కేసులు పెట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలి' - ప్రత్తిపాడులో తెదేపా ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా.. ప్రత్తిపాడు మండలం చిన శంకర్ల పూడి గ్రామానికి చెందిన తెదేపా బీసీ నేత ఏపూరి శ్రీనివాస్పై అక్రమ కేసు నమోదు చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఎస్సైపై అనుచిత వ్యాఖ్యల కేసులో శ్రీనివాస్ 10 రోజుల క్రితం జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు.
!['అక్రమ కేసులు పెట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలి' tdp protest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7682905-802-7682905-1592564637755.jpg)
tdp protest news