ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వ వైఖరిపై తెదేపా నిరసన - tdp leaders protest p.gannavaram village

విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో వ్యవహరిస్తుందని తూర్పుగోదావరి జిల్లా తెదేపా నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు పి. గన్నవరంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

tdp protest at east godavari district
డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వ వైఖరిపై తెదేపా నిరసన

By

Published : May 17, 2020, 7:08 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్, అతని కుటుంబం పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని నినాదాలు చేశారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అంబేడ్కర్ విగ్రహానికి సమర్పించారు. తెదేపా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం, మండల తెదేపా ఆధ్యక్షుడు పడాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పెచ్చెట్టి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:డాక్టర్​పై దాడిని ఖండిస్తూ... తెదేపా ఆధ్వర్యంలో నిరసన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details