ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానుల నిర్ణయంపై నిరసనల హోరు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం నేతలు ధర్నా చేపట్టారు. రెండో రోజు కూడా తెదేపా నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం వల్ల నివాసాల్లోనే నిరసనలు తెలిపారు.

tdp leaders protest in east godavari district
మూడు రాజధానుల నిర్ణయంపై తూర్పుగోదావరి జిల్లాలో నిరసనల హోరు

By

Published : Jan 21, 2020, 8:14 PM IST

రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరంలో తెదేపా నేత ఆదిరెడ్డి అప్పారావు కార్యకర్తలతో కలిసి తన నివాసంలోనే నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రానికి నిన్న చీకటి దినంగా అభివర్ణిస్తూ... నల్ల జెండాలను చేతపట్టారు. జగన్​ నిర్ణయాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి, కేసీఆర్​కు ప్రయోజనకరంగా ఉన్నాయని ఆదిరెడ్డి వాసు అన్నారు.

రాజమహేంద్రవరం

పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించిన తెదేపా అధినేతను నిండు సభలో వైకాపా నేతలు అవమానపరిచారని తెదేపా నేత కృష్ణ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి ఆ హక్కును కాలరాస్తోందని మండిపడ్డారు.

కాకినాడ

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డుపై ధర్నా చేస్తున్న వనమాడి కొండబాబు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని కాకినాడలో గృహనిర్బంధం చేశారు. రాజధానిని మూడు ముక్కలుగా చేయడం రాష్ట్రానికి చీకటి దినమని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చదవండి :

రాజధాని మార్పుపై అనంతపురం జిల్లాలో నిరసనలు

ABOUT THE AUTHOR

...view details