ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది: జ్యోతుల నవీన్

By

Published : Dec 10, 2020, 4:02 PM IST

రాష్టంలో ఎక్కడ చూసిన అవినీతి రాజ్యమేలుతుందని కాకినాడ తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది అయితే...రాజధానిని ధ్వంసం చేసిన ఘనత సీఎం జగన్​ది అని విమర్శించారు.

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది

రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది అయితే... రాజధానిని ధ్వంసం చేసిన ఘనత సీఎం జగన్​ది అని తెదేపా నేత జ్యోతుల నవీన్ విమర్శించారు. నాడు-నేడు మంచి కార్యక్రమమైనా..అధికార వైకాపా నాయకులు అధిక అంచనాలతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. పాఠశాలల అభివృద్ధి పేరిట జరిగే దోపిడీని భవిష్యత్తులో ఆధారాలతో బయటపెట్టి అవినీతి సొమ్మును కక్కిస్తామన్నారు. రాష్టంలో ఎక్కడ చూసిన అవినీతి రాజ్యమేలుతుందని నవీన్ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details